Monday, September 2, 2024

Buy now

andhra pradesh: ప్రభుత్వ ఆస్పత్రిలో చేతబడి?

ప్రభుత్వాస్పత్రిలో చేతబడి పూజలు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం రేపుతోంది.

చేతబడికి ఉపయోగించే కోసిన నిమ్మకాయలు, రంగురంగుల దారాలు, వక్క చీటీలతో పాటు ఆకులు మూడు వరుసల్లో కనిపించాయి.

ఇదంతా గ్యాస్ట్రో ఏంట్రాలజీ వార్డు వద్ద కనిపించడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో పాటు రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు.

గుర్తు తెలియని వ్యక్తులెవరో రాత్రిపూట ఈ చేతబడి పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఎవరైనా రోగికి నయం కావాలని చేశారా.. లేదంటే చెడు జరగాలని చేశారా అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఇలా చేతబడి పూజలు వెలుగులోకి రావడంతో అంతా భయాందోళకు గురవుతున్నారు.

Related Articles

spot_img

Most Popular