యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
‘వంద మంది ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా? కానీ 100 హిందూ ఇళ్లు ఉన్న ప్రాంతంలో మాత్రం ఒక్క ముస్లిం కుటుంబం ఉన్నా సురక్షితంగా ఉంటుంది’ అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన ముస్లింల భద్రతపై ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారన్నారు. ప్రస్తుతం యూపీలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
చరిత్రలో ఏ హిందూ రాజు కూడా ఏ దేశాన్ని ఆక్రమించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక సంభాల్ వద్ద తవ్వకాలపై స్పందించిన యోగి చుట్టుపక్క ఉన్న దేవాలయాలను తవ్వి వెలికి తీస్తామని స్పష్టం చేశారు.
ఈద్గా మసీద్, కృష్ణ జన్మభూమిపై స్పందించిన ఆయన కోర్టు ఆదేశాన్ని మాత్రమే అనుసరిస్తున్నట్లు తెలిపారు. లేదంటే ఇప్పటికే అక్కడ చాలా విధ్వంసం జరిగి ఉండేదన్నారు. వక్ఫ్బోర్డును విమర్శించిన యోగి బుల్డోజర్ చర్యలు సమర్థించుకున్నారు.