రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఈఓ వినోద్ ప్రసాదం అందజేశారు.
అనంతరం చైర్మన్, సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.