మెదక్: మాబోజిపల్లి గీత హైస్కూల్లో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్, వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరిస్తూ, విద్యార్థులు విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మద్దతుగా మానవహారంలో పాల్గొన్నారు.

