Thursday, July 16, 2026

Buy now

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ:వరంగల్ పర్యటనలో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), వరంగల్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు.

అనంతరం గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమైన ఎంపీ కడియం కావ్య, వరంగల్ ప్రాంత అభివృద్ధి, విద్యా రంగ పురోగతి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ఎన్‌ఐటీ వరంగల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular