ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
శనివారం ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు కలెక్టర్ చేతుల మీదుగా మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు.
ఐడీఓసీ కార్యాలయం వద్ద దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్న కలెక్టర్ ఆదార్శ్ సురభి,అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్.

