Friday, August 14, 2026

Buy now

దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణపై సమీక్ష

* రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
* అధికారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలు

హన్మకొండ: హన్మకొండ జిల్లా చింతగట్టులోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళవారం దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, వినియోగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి **శ్రీ కేఆర్ నాగరాజు** పాల్గొన్నారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, తాగునీటి ఎత్తిపోతలు, పంపుహౌస్‌ల పనితీరు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేఆర్ నాగరాజు అన్నారు. రైతులకు అవసరమైన నీటిని కాలువల ద్వారా సమర్థవంతంగా అందించాలని సూచించారు.

ముఖ్యంగా పర్వతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, దీనివల్ల పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సౌత్, లెఫ్ట్ కెనాల్‌ల ద్వారా 15 రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీహరి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular