ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి ఆయన స్వగృహంలో బిఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పూలబుకే ఇచ్చి స్వాగతించారు. విదేశాల్లోని తెలంగాణ ఎన్నారైలను కలిసి రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధిపై నిరంజన్రెడ్డి చర్చించారని అశోక్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రావ్, రఘువర్ధన్ రెడ్డి, మాణిక్యం, పరంజ్యోతి, ధర్మానాయక్, మాధవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

