మెదక్:మహిళలు, బాలికలపై వేధింపులు, ఈవ్టీజింగ్, స్టాకింగ్, సైబర్ నేరాలు వంటి ఘటనలను ఏ మాత్రం సహించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు.
మెదక్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో దాతర్పల్లి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాల హాస్టల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
భయపడొద్దు… సమస్య ఎదురైతే వెంటనే షీ టీమ్, మహిళా హెల్ప్ డెస్క్ లేదా ERSS-112ను సంప్రదించండి. అప్రమత్తతే మీ రక్షణ.

