ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను రేవల్లి మండల సోషల్ మీడియా నాయకుడు చిట్టి రాజుల నరసింహ శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. యువతకు కేటీఆర్ నాయకత్వం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని నరసింహ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీపై రేవల్లి మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

