Wednesday, July 15, 2026

Buy now

చికిత్స కోసం రూ.2.50 లక్షల LOC అందజేత.. బాధితుడికి మంత్రి శ్రీధర్ బాబు భరోసా

మంథని: అనారోగ్యంతో బాధపడుతున్న మంథని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రాజ పోచయ్యకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వైద్య సహాయం అందించారు.

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిట్యాల రాజ పోచయ్య (తండ్రి: రాజయ్య) వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా **రూ.2.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)** మంజూరు చేయించారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఈ సహాయం మంజూరై, హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు LOC అందజేశారు.

ఈ సందర్భంగా తమ కుటుంబానికి ఆపన్నహస్తం అందించి వైద్య చికిత్సకు అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు చిట్యాల రాజ పోచయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular