Thursday, July 30, 2026

Buy now

నీట్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

* ​ఏదులలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీని అడ్డుకోవడంలో విఫలమైన కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఏదుల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… నీట్ పేపర్‌ను లీక్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో విద్యార్థుల తరుఫున గళమెత్తుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ఎంపీల అరెస్టును తీవ్రంగా ఖండించారు. ​ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ కొంకి వెంకటేష్, మండల ఇంచార్జ్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి, చీరకపల్లి సర్పంచ్ రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జమ్మి మల్లేష్ యాదవ్, NSUI మండల అధ్యక్షుడు జానకిరామ్ యాదవ్, గ్రామ అధ్యక్షుడు రమేష్, నాయకులు శేషిరెడ్డి, పరశురాం, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular