పెద్దపల్లి : నేడు జరగబోయే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా స్థానిక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టిఎస్ టిఎస్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు జన్మదినం వేడుకల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోబిన్, మాజీ కౌన్సిలర్స్ బిక్షపతి, స్వామి, ఉపసర్పంచ్ మేకల కుమార్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, బింగి రాజు, మేడుడుల రాజ్ కుమార్, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, పెంచాల శ్రీకాంత్, శ్రీకాంత్, కంచి నాగరాజ్, దాసరి సతీష్, ఇరుగురాల స్వామి దాస్, సాయి, వెంకటేష్, కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

