Friday, August 7, 2026

Buy now

కోనేటిలో పడి డ్రైవర్ మృతి

ప్రజానావ,ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో:** వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆలయ కోనేటిలో పడి ఓ డ్రైవర్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండి. నజీర్ (43) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కోనేటి వద్దకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. విషయం గమనించిన బంధువులు వెంటనే గాలింపు చేపట్టగా, కోనేటిలో నజీర్ మృతదేహం లభ్యమైంది.మృతుడి మేనల్లుడు ఎండి. మహమూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శశిధర్ తెలిపారు.

Related Articles

spot_img

Most Popular