Saturday, August 15, 2026

Buy now

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

* అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
* ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం తొగ్రాయి గ్రామానికి చెందిన ఈదునేరు పద్మ తన భరత మరణించిన తర్వాత తన ఇద్దరు కుమారులు కోడలు అన్నం పెట్టడం లేదని తన భూమిని దౌర్జన్యంగా దున్నుకుంటున్నారని తన సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీవో పెద్దపల్లికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి మండలం గౌ రెడ్డి పేట గ్రామానికి చెందిన పద్మ తన భూమిలో కార్పొరేషన్ బోరింగ్ మంజూరు అయిందని, తనకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి విద్యుత్తులైన మోటర్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా హార్టికల్చర్ అధికారికి రాస్తూ సోలార్ పంప్ సెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంథని కు చెందిన ఆకుల సౌమ్య పట్టణంలోని పదవ వార్డు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్ట్ తనకు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారి కు రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని అదనపు తెలిపారు. పెద్దపల్లి మండలం రంగంపల్లికి చెందిన ఎం.జయశ్రీ తను బీఎస్సీ నర్సింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసానని, తనకు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టు భర్తీ చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కు రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ బి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular