మంథని: వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం గోదావరిఖని సబ్డివిజన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ను ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కీలక రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించారు.
పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, కేసులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. CCTNSలో కేసులు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని** సూచించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఏసీపీ పేర్కొన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని, నేరాల నివారణకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.ఈ తనిఖీలో **మంథని సీఐ బుద్దె స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్** తదితరులు పాల్గొన్నారు.

