Monday, August 24, 2026

Buy now

ఆటో కార్మికులకు మంత్రి పొన్నం భరోసా:మంత్రి పొన్నం

* ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే బోర్డు విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తామని వెల్లడించారు.

* ఛార్జీల పెంపుపై అధ్యయన కమిటీ
ఆటో ఛార్జీల పెంపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఛార్జీల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

* చర్చలతోనే సమస్యలకు పరిష్కారం
ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, కార్మికులు చర్చలకు వచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.

* ఈ-ఆటోలకు మారితే రూ.1.50 లక్షల వరకు సాయం
సంప్రదాయ ఆటోల నుంచి ఈ-ఆటోలకు మారే కార్మికులకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే అంశాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆటో కార్మికుల సంక్షేమంతో పాటు వారి జీవనోపాధికి భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

Related Articles

spot_img

Most Popular