Friday, August 14, 2026

Buy now

SIR ప్రక్రియలో ములుగు నియోజకవర్గం 100 శాతం పూర్తి

* 2,36,970 మంది ఓటర్లలో 2,09,128 మంది వివరాల డిజిటలైజేషన్‌
* 27,842 మంది వివిధ కారణాలతో అన్‌కలెక్టబుల్‌గా గుర్తింపు

ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్‌ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

SIR కార్యక్రమం జూన్‌ 25న ప్రారంభమైందని కలెక్టర్‌ వెల్లడించారు. తొలి దశలో జూన్‌ 25 నుంచి 30వ తేదీ వరకు ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాలను సేకరించడంతో పాటు ఓటర్ల వివరాల పరిశీలన, ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టారని వివరించారు.

ములుగు నియోజకవర్గంలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,09,128 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 88.25 శాతం అని పేర్కొన్నారు.

* 27,842 మంది అన్‌కలెక్టబుల్‌

మిగిలిన 27,842 మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్‌గా గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 8,354 మంది మరణించినవారు, 4,015 మంది డబుల్‌ ఎంట్రీలు ఉన్నవారు, 14,207 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 1,219 మంది ఆచూకీ లభించనివారు ఉన్నట్లు వెల్లడించారు. అన్‌కలెక్టబుల్‌గా గుర్తించిన వారి శాతం 11.75 గా ఉందన్నారు.

డిజిటలైజేషన్‌ పూర్తయిన 88.25 శాతం, వివిధ కారణాలతో అన్‌కలెక్టబుల్‌గా గుర్తించిన 11.75 శాతం కలిపి ములుగు నియోజకవర్గంలో SIR ఎన్యూమరేషన్‌ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.

నిర్ణీత గడువులో SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలను జిల్లా కలెక్టర్‌ అభినందించారు.

Related Articles

spot_img

Most Popular