హైదరాబాద్: హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన S.I.R. Phase-2 శిక్షణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరై, S.I.R. ప్రక్రియలో Phase-2కు సంబంధించిన కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా S.I.R. కోఆర్డినేటర్లతో కలిసి Phase-2 కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. కార్యక్రమం అమలులో సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదేనని పేర్కొన్నారు. ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ S.I.R. ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

