పెద్దపల్లి : ముస్లిం ల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త (సల్లేవా సల్లం) పుట్టినరోజు వేడుకలను పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని గత రెండు రోజులుగా ఎంబి గార్డెన్లో మర్కాజ్ మిలాత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి జామా మసీదు నుండి జండా చౌరస్తా, కమాన్, అయ్యప్ప టెంపుల్, బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జామా మసీదు మౌలానా మహమ్మద్ అజీముద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచశాంతికి ఉపయోగపడ్డాయని, నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా, మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో నడచి, కన్న తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మర్కాజ్ మిలాద్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు, చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

