ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో : ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆమె బాధితుల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా చట్టబద్ధంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతి వినతిని నిష్పక్షపాతంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

