Sunday, September 6, 2026

Buy now

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని:రేపు రామగుండంలో నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వేదిక, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు, పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజలకు తాగునీరు, పార్కింగ్, వాహనాల రాకపోకలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సభ విజయవంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

Related Articles

spot_img

Most Popular