Friday, July 17, 2026

Buy now

ఎస్పీని కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా ఎస్పీ సునితా రెడ్డిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. లింగాచారి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
​అనంతరం ఎస్పీ సునితా రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమిష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి సమన్వయంతో పనిచేస్తూ ప్రజా భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular