వరంగల్: వరంగల్ డీఐజీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో జోన్-4 డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బాలస్వామి, సురేష్ కుమార్, హనుమకొండ, క్రైమ్, ట్రాఫిక్ ఏసీపీలు నర్సింగరావు, సదయ్య, సత్యనారాయణ, ఆర్ఐ సతీష్తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

