Sunday, September 6, 2026

Buy now

జెండా పండుగ, అన్నదానం, నృత్యార్చనతో ఘనంగా అలరించిన అన్నమయ్యపురం

* భక్తిరసంతో అలరించిన నటరాజ నృత్య నికేతన్ నృత్యార్చన

హైదరాబాద్‌,మాదాపూర్‌,అన్నమయ్యపురం: పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం జాతీయ పతాకావిష్కరణ, మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ, సాయంత్రం నటరాజ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నృత్యార్చన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని దేశభక్తి భావంతో నిర్వహించగా, మధ్యాహ్నం అన్నమయ్యపురానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందించారు. సాయంత్రం నిర్వహించిన నృత్యార్చన కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో ఆకట్టుకుంది.

# ఆధ్యాత్మిక పారాయణాలతో నృత్యార్చనకు శ్రీకారం

సాయంత్రం కార్యక్రమం తొలుత “శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి” తో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.

అనంతరం నటరాజ నృత్య నికేతన్‌కు చెందిన శిష్యులు భక్తిరసభరితమైన అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి నృత్య కైంకర్యాన్ని సమర్పించారు.

# అన్నమయ్య సంకీర్తనలకు నృత్యరూపంలో నివాళి

లయ, తాళం, భావాభినయం, హస్తముద్రలను సమన్వయం చేస్తూ శిష్యులు ప్రదర్శించిన నృత్యరూపకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనలతో అన్నమయ్యపురం భక్తిరసంతో నిండిపోయింది.

ఈ కార్యక్రమంలో సారా తిలక్, అక్షయ ఎన్., రిత్విక బాలివాడ, నివేదా పొనుగోటి, జి. మానస్వి, జి. గాయత్రి రెడ్డి, శ్రీష్ణిత రెడ్డి, భువిక వల్లూరి, వి. శ్రీలలిత, ఎం. హర్షిత, దూతి శ్రీ పాలడుగు, మిరియాల నామస్వి సాయి, అదితి సంహిత, సుహాన్వి ఎస్., శ్రీహిత చంద్రశేఖర్, ఎస్. అన్విత, కాంశిక, పి. సాధ్విక, సాయి అన్విత నాదింపల్లి, సాయి చైత్ర నాదింపల్లి, ఎ. జోషిత, రిషిక, నామస్వి జోస్యుల, శరణ్య శ్రీజ, రావూరి దాక్షిణ్య, కోమల్ సాయి కుకుట్ల, బి. వంశిక, ప్రణమ్య రెడ్డి (నైనీ), ఒడూరి ప్రభా వర్ణిక, తన్వి ఎం., సంజన గాజుల, శ్రీ త్వారిత వేముల, ఎ. రిషి శ్రీ, పెయ్యాల చెర్వితవల్లి, ఎం.ఎల్. స్నేహారెడ్డి, వి. వెంకట హన్విక, తన్వి గణేశుని, యోక్షిత శ్రీ యరగోగు, జాహ్నవి ప్రియ తదితరులు పాల్గొని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

# కళాకారులకు అభినందనలు
ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని పక్షాన కళాకారులను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న నటరాజ నృత్య నికేతన్ గురువులను ప్రశంసించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ, అన్నదానం, ఆధ్యాత్మిక పారాయణాలు, కూచిపూడి నృత్యార్చనలతో అన్నమయ్యపురం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పింది.

Related Articles

spot_img

Most Popular